కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: సీఈవో వికాస్ రాజ్

- June 01, 2024 , by Maagulf
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్‌: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతి మూల కవర్‌ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గంటారని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com