కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు
- July 02, 2015
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ముఖ్యంగా ఆహర విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి తాము తీసుకునే ఆహారంలో వారికి తెలియకుండానే కిడ్నీలకు చెడు చేసే అనేక రకాల కారకాలు ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తినడం చాలా తగ్గించాలి. శాఖాహారంలో ప్రోటీన్లు, మాంసాహారంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాబట్టి శాఖాహారం ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొన్ని రకాల కూరగాయల్లో కూడా అధిక ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి అవి గమనించుకొని వాడాలి. అంతేకాదు పోటాషియం కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలోని పొటాషియంను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి వీరు తినే ఆహారంలో పొటాషియం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రం చేయని కూరగాయల్లో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలిన చిన్న చిన్న ముక్కలుగా కోసి, 20 నిముషాలు నీటిలో నానిన తరువాత వండుకుని తినాలి. ప్రోటీన్లు లభించని ఆహారం తీసుకోకపోతే శరీరానికి పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాటి స్థానంలో పోషకాలు ఎక్కువగా ఉండే పళ్లు, పిండిపదార్ధాలు ఎక్కువగా ఉండే కొన్నిరకాల మాంసకృత్తులు పాలు, గుడ్డులోని తెల్ల సొన వంటివి ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వును కలిగించే నూనె, నెయ్యి వంటి వాటిని మితంగా వాడాలి. సాధారణంగా హై బీపీ ఉన్నవాళ్లే ఉప్పు తక్కువ తినాలని అంటుంటారు. కానీ కిడ్నీ సమస్యలున్నవాళ్లు కూడా ఉప్పు తక్కువగా తినడం మంచిది. కిడ్నీ సమస్యలు ఏ దశలో ఉన్నా సరే ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







