వెనిజుల అధ్యక్షుడిగా మరోసారి నికోలస్...
- July 29, 2024
కారకాస్: వెనెజువెలా అధ్యక్షుడిగా నికోసల్ మడురో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈవిషయాన్ని ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ అధిపతి ఎల్విస్ అమోరోసో ప్రకటించారు. మొత్తం 80శాతం ఓట్లను లెక్కించగా మడురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02శాతమే లభించాయి.
ఈ ఎన్నికల కౌంటింగ్లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ తమ అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు మద్దతుగా ఏకమయ్యాయి. ప్రతిపక్షం ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వేల మంది మద్దతుదారులను పిలిపించాయి. వారు కౌంటింగ్ను ప్రత్యక్షంగా వీక్షించి ఫలితాలను ప్రకటించేందుకు ఇలా చేసింది. కానీ, పోలీసులు చాలా కేంద్రాల నుంచి వీరిని వెళ్లగొట్టారని గోంజాలెజ్ వర్గం వెల్లడించింది.
ఆదివారం అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. వేతనాల్లో కోత, ఆకలికేకలు, వలసలు, చమురు పరిశ్రమలో సంక్షోభం వంటి సమస్యలతో కునారిల్లుతున్న వెనెజువెలాలో మొత్తం ఓటర్లు దాదాపు 1.70 కోట్లు. ప్రజా వ్యతిరేకతను మడురో కూడగట్టుకొన్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. బరిలో ఎనిమిది మంది అభ్యర్థులున్నా మడురో, గొంజాలెజ్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఎన్నికల ముందు జరిగిన ఒపీనియన్ పోల్స్లో మడురోపై గోంజాలెజ్కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అధికారిక సోషలిస్టు పీఎస్యూవీ పార్టీని మార్చాలని తాము భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి