హోట‌ల్ కు నిప్పు…24 మంది స‌జీవ ద‌హ‌నం

- August 06, 2024 , by Maagulf
హోట‌ల్ కు నిప్పు…24 మంది స‌జీవ ద‌హ‌నం

ఢాకా: బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. ప్ర‌ధాని షేక్ హాసీనా ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళ‌న‌కారులు శాంతించ‌డం లేదు.. ఆమె పార్టీ నేత‌ల‌పై దాడులు కొన‌సాగిస్తున్నారు.. ఇప్ప‌టికే ఆ పార్టీ ఎంపి , క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంటిని త‌గుల బెట్టిన విధ్వంస‌కారులు తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమ‌య్యారు.. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా వెల్ల‌డించింది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com