నేటి నుంచి ‘హర్ ఘర్ తిరంగా’

- August 09, 2024 , by Maagulf
నేటి నుంచి ‘హర్ ఘర్ తిరంగా’

న్యూ ఢిల్లీ: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని https://harghartiranga.com/వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని సూచించారు.

‘హ‌ర్‌ఘ‌ర్‌తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా మోదీ ట్వీట్‌ పెట్టారు.

‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్‌ఘర్‌తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్‌ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.com/లో షేర్‌ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com