రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం..

- August 11, 2024 , by Maagulf
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం..

తూర్పు తైమూర్: తూర్పు తైమూర్ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. తూర్పు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా ఆమెను ఈ పౌర పురస్కారంతో సత్కరించారు. సామాజిక సేవ, విద్యారంగం, మహిళల సాధికారతా విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com