మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన

- August 20, 2024 , by Maagulf
మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన

న్యూఢిల్లీ: మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల పనిప్రదేశంలో భద్రత కోసం ప్రణాళికను  రూపొందించడానికి పది మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్‌ కావడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఈ కేసులో సరైన సమయంలో ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పోస్ట్‌మార్టమ్‌లో వైద్యురాలు హత్యకు గురైనట్లు తేలినా.. రాత్రి 11.45 గంటల వరకు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఆస్పత్రిలో అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీసింది. ప్రిన్సిపల్‌ ఏం చేస్తున్నాడు.. ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు. గురువారంలోగా దర్యాప్తు స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. కార్యాలయంలో మహిళల భద్రత గురించి ఎదురవుతున్న ఆందోళనలపై పౌరులు మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com