'సాహసం శ్వాసగా సాగిపో'' సాంగ్ ట్రైలర్స్ విడుదల..
- June 17, 2016
నాగచైతన్య ,మంజిమ మోహన్ ప్రధాన పాత్రలలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త గా ఉన్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తుండగా, మిరియాల రవీందర్రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఈ చిత్ర పాటలు విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని ప్రముఖ కథానాయకులు నాగార్జున, గోపీచంద్ ఆవిష్కరించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ ఇప్పటికీ 'ఏ మాయ చేసావె' పాటలు వెంటాడుతున్నాయి. 'సాహసం శ్వాసగా సాగిపో'తో మరిన్ని అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు ఎ.ఆర్.రెహమాన్గారికి కృతజ్ఞతలు.
ఆయనతో పనిచేసే అవకాశం రెండోసారి ఇప్పించారు గౌతమ్మేనన్. విజయాల్ని అందించిన దర్శకులతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకొంటుంటా. అలాంటి అవకాశం గౌతమ్ మీనన్ తో వచ్చినందుకు ఆనందంగా ఉంది 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఓ గొప్ప ప్రయాణం అని తెలిపాడు చైతూ. ఇక ఈ కార్యక్రమంలో డి.సురేష్బాబు, సాయిధరమ్ తేజ్, రెజీనా, వంశీ పైడిపల్లి, కల్యాణ్కృష్ణ, అనంత శ్రీరామ్, దశరథ్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆడియో వేడుక సందర్బంగా కొన్ని సాంగ్ ట్రైలర్స్ విడుదల చేసారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









