కిడ్నీలో స్టోన్స్.! ఈ డైట్ ఫాలో చేస్తే, సర్జరీ అవసరం లేదా.?
- August 27, 2024
కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. మన శరీరంలోని వ్యర్ధాల్ని బయటికి పంపించి శరీరాన్ని ఆరోగ్యాన్ని వుంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయ్. మరి, మనం ఫాలో చేసే కొన్ని ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంటాయ్.
కిడ్నీలో స్టోన్స్ చాలా చాలా బాధాకరమైన సమస్య. అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఏం చేయాలి.? వైద్యుని సంప్రదించి సూచన మేరకు సర్జరీని ఆశ్రయించాలి. స్టోన్ సైజ్ని బట్టి, కొందరికి మందులు కూడా సూచిస్తుంటారు వైద్యులు.
ఆయా మందుల ద్వారా కిడ్నీలో రాళ్లు మెల్లగా కరిగిపోతాయ్. అయితే, వైద్య సూచనలతో పాటూ, కొన్ని రకాల ఆకుకూరలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కీలకంగా పని చేస్తుందని అంటారు. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లు కొండ పిండి ఆకు రసం తాగితే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు.
అలాగే బచ్చలి ఆకు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయ్. తెల్ల గోంగూర ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్. చామ ఆకులు రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీలో స్టాన్స్ కరిగించుకోవచ్చు.
ఆకుకూరల్లో పొన్నగంటి కూరకు కిడ్నీలో స్టోన్స్ కరిగించే శక్తి ఎక్కువగా చెబుతారు. ఈ ఆకుకూర తీసుకునే అలవాటున్న వారిలో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు