కిడ్నీలో స్టోన్స్.! ఈ డైట్ ఫాలో చేస్తే, సర్జరీ అవసరం లేదా.?
- August 27, 2024
కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. మన శరీరంలోని వ్యర్ధాల్ని బయటికి పంపించి శరీరాన్ని ఆరోగ్యాన్ని వుంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయ్. మరి, మనం ఫాలో చేసే కొన్ని ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంటాయ్.
కిడ్నీలో స్టోన్స్ చాలా చాలా బాధాకరమైన సమస్య. అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఏం చేయాలి.? వైద్యుని సంప్రదించి సూచన మేరకు సర్జరీని ఆశ్రయించాలి. స్టోన్ సైజ్ని బట్టి, కొందరికి మందులు కూడా సూచిస్తుంటారు వైద్యులు.
ఆయా మందుల ద్వారా కిడ్నీలో రాళ్లు మెల్లగా కరిగిపోతాయ్. అయితే, వైద్య సూచనలతో పాటూ, కొన్ని రకాల ఆకుకూరలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కీలకంగా పని చేస్తుందని అంటారు. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లు కొండ పిండి ఆకు రసం తాగితే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు.
అలాగే బచ్చలి ఆకు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయ్. తెల్ల గోంగూర ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్. చామ ఆకులు రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీలో స్టాన్స్ కరిగించుకోవచ్చు.
ఆకుకూరల్లో పొన్నగంటి కూరకు కిడ్నీలో స్టోన్స్ కరిగించే శక్తి ఎక్కువగా చెబుతారు. ఈ ఆకుకూర తీసుకునే అలవాటున్న వారిలో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









