సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ!

- September 22, 2024 , by Maagulf
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ!

అమరావతి: చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు చర్చ జరిపారు. 

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు టీటీడీ ఆహ్వానం అందించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తితిదే ఈవో, అదనపు ఈవో ఆహ్వానాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసిన అధికారులు. సీఎంకు అర్చకులు, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com