శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం పూర్తి
- September 23, 2024
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో సోమవారం ఆలయంలో ప్రాయశ్చిత్తహోమం నిర్వహించింది టీటీడీ. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా పుణ్యహవచనం, మహాశాంతి హోమం, వాస్తు హోమం పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగమ సలహామండలి సూచించడంతో అందుకు అనుగుణంగా శరవేగంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అటు రాష్ట్రం ఇటు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూలో కల్తీనెయ్యి వినియోగం వివాదం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలను టీటీడీ అమలు చేసింది. లడ్డూ వివాదం జూలై నెలలో జరిగిన నేపథ్యంలో అటు తరువాత ఆలయ సంప్ర దాయాల మేరకు ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించినందున ఎలాంటి దోషాలు ఉండవని కాని భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో మరోసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆగమ పండితులు అంగీకరించడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసి పూర్తిచేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!