శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం పూర్తి
- September 23, 2024
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో సోమవారం ఆలయంలో ప్రాయశ్చిత్తహోమం నిర్వహించింది టీటీడీ. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా పుణ్యహవచనం, మహాశాంతి హోమం, వాస్తు హోమం పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగమ సలహామండలి సూచించడంతో అందుకు అనుగుణంగా శరవేగంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అటు రాష్ట్రం ఇటు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూలో కల్తీనెయ్యి వినియోగం వివాదం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలను టీటీడీ అమలు చేసింది. లడ్డూ వివాదం జూలై నెలలో జరిగిన నేపథ్యంలో అటు తరువాత ఆలయ సంప్ర దాయాల మేరకు ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించినందున ఎలాంటి దోషాలు ఉండవని కాని భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో మరోసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆగమ పండితులు అంగీకరించడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసి పూర్తిచేసింది.
తాజా వార్తలు
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!









