విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!

- September 25, 2024 , by Maagulf
విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!

యూఏఈ: డ్యూటీలో ఉండగా జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సాయుధ దళాల సభ్యులు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వీర జవాన్లను కోల్పోయినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. కాగా, ఫిబ్రవరిలో సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సాయుధ దళాలకు చెందిన నలుగురు సభ్యులతోపాటు ఒక బహ్రెయిన్ అధికారి మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com