55 కిలోల కొకైన్ స్వాధీనం.. అరటిపండ్ల రవాణాలో దాచి..అడ్డుకున్న కస్టమ్స్..!!
- September 26, 2024
రియాద్: రాబిగ్ గవర్నరేట్లోని కింగ్ అబ్దుల్లా పోర్ట్లోని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ అధికారులు 54.8 కిలోల మాదక ద్రవ్యాల కొకైన్ స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేశారు. ఓడరేవు ద్వారా రాజ్యానికి వచ్చిన అరటిపండ్ల రవాణాలో వాటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. అరటిపండు కంటైనర్లపై అనుమానంతో స్క్రీనింగ్ ద్వారా తనిఖీలు చేయగా.. భారీగా కొకైన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు అథారిటీ తెలిపింది. సెప్టెంబరులో కింగ్ అబ్దుల్లా ఓడరేవు వద్ద ఇది రెండవ అతిపెద్ద డ్రగ్స్ రవాణా. ఈ నెల ప్రారంభంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC), జకాత్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో 236 కిలోగ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే (1910) లేదా ఇమెయిల్ ([email protected]), అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలిపి ప్రతి ఒక్కరూ సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







