ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!
- October 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా ధాహి అల్-అజీల్ అల్ అస్కర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బందర్ సలేం అబ్దుల్లా అల్-ముజాయాన్ను కూడా కలిశారు. ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం సహా వివిధ అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









