ముంబైలో అగ్ని ప్రమాదం-ఐదుగురు దుర్మరణం

- October 06, 2024 , by Maagulf
ముంబైలో అగ్ని ప్రమాదం-ఐదుగురు దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం..ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చలరేగాయి.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబం నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. బాధితులను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com