‘విశ్వం’తో శీను వైట్ల కమ్ బ్యాక్ అవుతాడా.?
- October 07, 2024
ఒకప్పుడు శీను వైట్ల సినిమాలంటే హాయిగా సకుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాలు. పండక్కి.. పండగలా అనిపించే సినిమాలు. కొన్ని సక్సెస్ ఫార్ములాస్తో ట్రెండ్ సృష్టించాడు శీను వైట్ల.
తద్వారా ఎన్నో సూపర్ హిట్లు అదే ఫార్మేట్లో తెరకెక్కి కొంత కాలం పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయ్. కానీ, ఇప్పుడు శీను వైట్ల హవా ఏమంత లేదు. మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడంటూ ఆయన్ని పక్కన పెట్టేశారు.
దాంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శీను వైట్ల నుంచి వస్తున్న చిత్రమే ‘విశ్వం’. గోపీచంద్, కావ్య థాపర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాని టి..జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కమర్షియల్ అంశాలతో పాటూ, ఆధ్యంతం వినోదం పంచేలా శీను వైట్ల మార్క్తో డిఫరెంట్ ప్యాటర్న్తో ఈ సినిమా వుండబోతోందనీ అంటున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయ్. గోపీచంద్కి ‘లౌక్యం’ తరహాలో ఓ సూపర్ హిట్ అందించే సినిమా అవుతుందని అంటున్నారు. చూడాలి మరి. అటు శీను వైట్లకీ, ఇటు గోపీచంద్కీ ఇద్దరికీ లక్కు తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







