‘విశ్వం’తో శీను వైట్ల కమ్ బ్యాక్ అవుతాడా.?
- October 07, 2024
ఒకప్పుడు శీను వైట్ల సినిమాలంటే హాయిగా సకుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాలు. పండక్కి.. పండగలా అనిపించే సినిమాలు. కొన్ని సక్సెస్ ఫార్ములాస్తో ట్రెండ్ సృష్టించాడు శీను వైట్ల.
తద్వారా ఎన్నో సూపర్ హిట్లు అదే ఫార్మేట్లో తెరకెక్కి కొంత కాలం పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయ్. కానీ, ఇప్పుడు శీను వైట్ల హవా ఏమంత లేదు. మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడంటూ ఆయన్ని పక్కన పెట్టేశారు.
దాంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శీను వైట్ల నుంచి వస్తున్న చిత్రమే ‘విశ్వం’. గోపీచంద్, కావ్య థాపర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాని టి..జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కమర్షియల్ అంశాలతో పాటూ, ఆధ్యంతం వినోదం పంచేలా శీను వైట్ల మార్క్తో డిఫరెంట్ ప్యాటర్న్తో ఈ సినిమా వుండబోతోందనీ అంటున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయ్. గోపీచంద్కి ‘లౌక్యం’ తరహాలో ఓ సూపర్ హిట్ అందించే సినిమా అవుతుందని అంటున్నారు. చూడాలి మరి. అటు శీను వైట్లకీ, ఇటు గోపీచంద్కీ ఇద్దరికీ లక్కు తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







