‘విశ్వం’తో శీను వైట్ల కమ్ బ్యాక్ అవుతాడా.?
- October 07, 2024
ఒకప్పుడు శీను వైట్ల సినిమాలంటే హాయిగా సకుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాలు. పండక్కి.. పండగలా అనిపించే సినిమాలు. కొన్ని సక్సెస్ ఫార్ములాస్తో ట్రెండ్ సృష్టించాడు శీను వైట్ల.
తద్వారా ఎన్నో సూపర్ హిట్లు అదే ఫార్మేట్లో తెరకెక్కి కొంత కాలం పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయ్. కానీ, ఇప్పుడు శీను వైట్ల హవా ఏమంత లేదు. మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడంటూ ఆయన్ని పక్కన పెట్టేశారు.
దాంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శీను వైట్ల నుంచి వస్తున్న చిత్రమే ‘విశ్వం’. గోపీచంద్, కావ్య థాపర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాని టి..జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కమర్షియల్ అంశాలతో పాటూ, ఆధ్యంతం వినోదం పంచేలా శీను వైట్ల మార్క్తో డిఫరెంట్ ప్యాటర్న్తో ఈ సినిమా వుండబోతోందనీ అంటున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయ్. గోపీచంద్కి ‘లౌక్యం’ తరహాలో ఓ సూపర్ హిట్ అందించే సినిమా అవుతుందని అంటున్నారు. చూడాలి మరి. అటు శీను వైట్లకీ, ఇటు గోపీచంద్కీ ఇద్దరికీ లక్కు తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









