మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!

- October 08, 2024 , by Maagulf
మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!

మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, అతనితో పాటు సైనిక ప్రతినిధి బృందం కువైట్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ను సందర్శించారు. MSC హెడ్ కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ కేంద్రానికి చేరుకున్న భారత సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు.  ఒమానీ సముద్ర పర్యావరణ భద్రతలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, పనుల గురించి ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భారత బృందం.. తాజా పరికరాలు, టెక్నాలజీలను స్వయంగా వీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com