కివి పండు తింటున్నారా.? అయితే, ఆరోగ్యం మీ చేతుల్లోనే.!
- October 10, 2024
కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ, కివి పండుతో వచ్చే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ కివి పండు తినే వారిలో గుండె జబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.
హై బీపీ వున్నవారు కివీ పండు తినడం వల్ల బీపీ కంట్రోల్లో వుంటుంది. కొన్ని సార్లు బిపీ పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా వున్నాయని చెబుతున్నారు.
తద్వారా గుండె పోటు సమస్యలు తక్కువవుతాయని అంటున్నారు. అంతేకాదు, కివి పండులో రోగనిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువ.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటూ, కడుపులో అల్సర్లను తగ్గించే శక్తి కూడా కివి పండుకుంది.
కివి పండు తింటే చర్మం నాజూగ్గా.. సున్నితంగా మారుతుంది. దాంతో, వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు, యవ్వనంలో వచ్చే మొటిమల సమస్య వుండదు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో వుండే కివి పండ్లను డయాబెటిస్ వున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. వీటికి రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేసే గుణం పుష్కలంగా వుంది.
అంతేకాదు, రకరకాల వైరల్ జ్వరాల కారణంగా వచ్చే ఒళ్లు నొప్పులు, వయసుతో పాటూ వచ్చే కీళ్లు మోకాలి నొప్పులకు కూడా కివి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకి వెళ్లే అవసరం వుండదని అంటారుగా.! ఆ నానుడి కివి పండుకీ వర్తిస్తుందన్నమాట.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







