కివి పండు తింటున్నారా.? అయితే, ఆరోగ్యం మీ చేతుల్లోనే.!
- October 10, 2024
కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ, కివి పండుతో వచ్చే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ కివి పండు తినే వారిలో గుండె జబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.
హై బీపీ వున్నవారు కివీ పండు తినడం వల్ల బీపీ కంట్రోల్లో వుంటుంది. కొన్ని సార్లు బిపీ పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా వున్నాయని చెబుతున్నారు.
తద్వారా గుండె పోటు సమస్యలు తక్కువవుతాయని అంటున్నారు. అంతేకాదు, కివి పండులో రోగనిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువ.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటూ, కడుపులో అల్సర్లను తగ్గించే శక్తి కూడా కివి పండుకుంది.
కివి పండు తింటే చర్మం నాజూగ్గా.. సున్నితంగా మారుతుంది. దాంతో, వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు, యవ్వనంలో వచ్చే మొటిమల సమస్య వుండదు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో వుండే కివి పండ్లను డయాబెటిస్ వున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. వీటికి రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేసే గుణం పుష్కలంగా వుంది.
అంతేకాదు, రకరకాల వైరల్ జ్వరాల కారణంగా వచ్చే ఒళ్లు నొప్పులు, వయసుతో పాటూ వచ్చే కీళ్లు మోకాలి నొప్పులకు కూడా కివి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకి వెళ్లే అవసరం వుండదని అంటారుగా.! ఆ నానుడి కివి పండుకీ వర్తిస్తుందన్నమాట.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









