ఎపిలో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ కోటి విరాళం

- October 13, 2024 , by Maagulf
ఎపిలో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ కోటి విరాళం

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని  ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు.ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.  విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవి గారికి సాదర స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు. ఇలా, చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ తమ పెద్ద మనసుతో వరద బాధితులకు సహాయం అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com