Dh400 ఫైన్.. జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానా..!!
- October 14, 2024
దుబాయ్: నైఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానాలు విధించారు. ప్రమాదకరంగా క్రాస్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్లను విస్మరించడం, ఇతరులకు ప్రమాదం కలిగించినందుకు జరిమానాలు విధించినట్టు అధికారులు తెలిపారు.ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 89 ప్రకారం.. పాదచారుల ట్రాఫిక్ సిగ్నల్లను ఉల్లంఘించడం లేదా అనధికార ప్రాంతాలలో క్రాసింగ్ చేస్తే Dh400 జరిమానా విధించబడుతుంది. ఇదిలా ఉండగా జైవాకింగ్ ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందో దుబాయ్ పోలీసులు చాలాసార్లు హైలైట్ చేశారు. నిర్దేశించని ప్రదేశాల నుండి ప్రజలు రోడ్లు దాటుతుండగా గతేడాది జరిగిన రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు. నైఫ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ ఒమర్ మౌసా అషౌర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం గురించి పాదచారులను గట్టిగా హెచ్చరించారు. క్రాసింగ్ గైడ్లైన్స్ను పాటించాలని, రోడ్డు దాటడానికి ముందు ట్రాఫిక్ ను గమనించాలని సూచించారు. పాదచారులు క్రాసింగ్ మార్గదర్శకాలను పాటించాలని, రోడ్డుపై వాహనాలు లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పాదచారుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు పిలుపునిచ్చారు. నిర్ణీత క్రాసింగ్ల వద్ద పాదచారుల క్రాసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వడంలో వాహన డ్రైవర్లు విఫలమైతే Dh500 జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లతో శిక్షార్హమైనదని హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి