అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి

- October 16, 2024 , by Maagulf
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి

అమెరికా: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా  ముగ్గురు మన తెలుగువాళ్లు మృతి చెందారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  అమెరికాలోని రాండాల్ఫ్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 

దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు.  తీవ్రంగా గాయపడిన హరిత భర్త సాయి చెన్ను.. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com