వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసిన మెకానికల్ ఇంజినీర్
- October 20, 2024
బెంగళూరు: "కాదేది కవితకు అనర్హం" అంటూ మన ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రాసిన "మహాప్రస్థానం" లోని ఈ వాక్యం కవిత్వానికి అనర్హమైనది ఏదీ లేదు అని సూచిస్తుంది. అలాగే “పట్టుదల ఉంటే కూడా ఏదైనా సాధించొచ్చు” అని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్. ప్రొడక్ట్ డిజైనర్ అయిన దీపక్ దధీచ్ తాజాగా ఇతను వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మరియు ప్రొడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేశారు. దీపక్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్ తయారీలో ప్రధానంగా వెదురు బొంగును ఉపయోగించి తక్కువ బరువుతో కూడిన బలమైన నిర్మాణంతో డ్రోన్ ని తయారు చేశాడు.
ఈ డ్రోన్ను ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణ పరిశీలన మరియు చిన్న సరుకుల రవాణా వంటి రంగాల్లో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు. తన సృజనాత్మకతను మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఒక వినూత్నమైన పరికరాన్ని తయారు చేసిన దీపక్ ను తన సహచరులు ఎంతగానో అభినందించారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స