బహ్రెయిన్ రోడ్లపై ఇ-స్కూటర్ బూమ్.. రైడ్స్ పై ఆందోళన..!!
- October 21, 2024
మనామా: బహ్రెయిన్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా ఇ-స్కూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జుఫైర్, మనామా, తుబ్లీ, ముహర్రాక్ వంటి ప్రాంతాల్లో ఇ-స్కూటర్ రైడ్స్ సాధారణంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది నివాసితులు వాటిపైనే రైడ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత,బ్రాండ్ ను బట్టి ఇ-స్కూటర్ల ధరలు BD100 నుండి BD300 వరకు ఉన్నాయి. ఇ-స్కూటర్ల వినియోగం పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రైడర్ల సంఖ్య రోడ్డు భద్రత, పాదచారుల నడక మార్గాలపై ఇ-స్కూటర్ల రైడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయని బహ్రెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీమ్ స్థాపకుడు జెరెమీ క్లావెరో తెలిపారు. ఇ-స్కూటర్ల కోసం ప్రత్యేక లేన్ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో బహ్రెయిన్లో ఇ-స్కూటర్ల కోసం యూరోపియన్ తరహా నిబంధనలను అనుసరించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక