ప్రముఖ రిటైలర్ లులూ ఐపీఓ.. నవంబర్ 14న లిస్టింగ్..25శాతం వాటా విక్రయం..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈ ప్రముఖ రిటైలర్ లులూ గ్రూప్ 25 శాతం షేర్లను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేర్ విలువ Dh0.051గా ప్రకటించింది. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం.. కంపెనీ మూడు-విడతల IPO ద్వారా 2.582 బిలియన్ల (2,582,226,338) షేర్లను విక్రయించనుంది. ఇది అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 5న ముగుస్తుంది. లులూ రిటైల్ హోల్డింగ్ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో జాబితా కానుంది. లిస్టింగ్ నవంబర్ 14న ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 28న ఆఫర్ ధరను ప్రకటించనుంది. లులూ షేర్ విక్రయానికి వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఏఈతోపాటు GCC ప్రాంతంలో 50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రిటైలర్లలో లులూ గ్రూప్ ఒకటి. రాబోయే ఐదేళ్లలో GCC దేశాల్లో మరింత విస్తరిస్తామని లులు రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక