సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
- October 24, 2024
న్యూ ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు.భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిస్ ఖన్నా నవంబర్ 11న భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఏడు నెలల పాటు ఉన్నత న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మే 13, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పని చేయనున్నారు. పదవీకాలం ముగిసిన CJI DY చంద్రచూడ్ ..జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడం జరిగింది.చంద్రచూడ్ తర్వాత అత్యంత సీనియన్ న్యాయమూర్తి కావడంతోనే సంజీవ్ ఖన్నాకు ఈ అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక