Dh100,000 నగదు తిరిగిచ్చిన ప్రవాస భారతీయుడు.. సన్మానించిన పోలీసులు..!!
- October 27, 2024
యూఏఈః 100,000 దిర్హామ్ల నగదును అథారిటీకి తిరిగి ఇచ్చినందుకు భారతీయ ప్రవాసిని సత్కరించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ నివాసి స్వదేశ్ కుమార్ నగరంలోని అల్ బర్షా ప్రాంతంలో నగదు దొరికింది. దానిని ఆయన నిస్వార్ధంగా పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వదేశ్కు పోలీసులు ప్రశంసా పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యత గల వ్యక్తిగా గొప్ప మానవత విలువలను కలిగి ఉన్నాడని పోలీసులు ప్రశంసించారు. అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. ప్రజా సహకారాన్ని పెంపొందించడం ద్వారా దుబాయ్ పోలీసులు తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో ఇటువంటి నిజాయితీ చర్యలు సహాయపడతాయని పేర్కొన్నారు. అనంతరం "విలువైన వస్తువులు నిజమైన యజమానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసేందుకు అల్ బార్షా పోలీస్ స్టేషన్కి తిరిగి ఇవ్వడం తన విధి" అని కుమార్ తనకు లభించిన గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







