పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి.. రియాద్ లో గ్లోబల్ కూటమి సమావేశం..!!
- October 30, 2024
రియాద్: పాలస్తీనాలో రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అంతర్జాతీయ కూటమి తన మొదటి సమావేశాలను సౌదీ రాజధాని రియాద్లో వచ్చే వారం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడం, బందీలను విడిపించేందుకు కృషి చేయడం, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అన్ని దేశాలు పాల్గొనేందుకు ప్రపంచ కూటమిని ప్రారంభించామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్సిలోనాలో జరిగిన 9వ ప్రాంతీయ ఫోరమ్లో ఈ మేరకు ఆయన తెలియజేశారు. రియాద్ సమావేశం తర్వాత, సంకీర్ణ కమిటీలు బ్రస్సెల్స్, కైరో, అమ్మాన్, ఇస్తాంబుల్, నార్వే రాజధాని ఓస్లోలో సమావేశం అవుతాయని తెలిపారు. గాజాలో పరిస్థితిని చర్చించడానికి రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని బోరెల్ సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







