పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి.. రియాద్ లో గ్లోబల్ కూటమి సమావేశం..!!
- October 30, 2024
రియాద్: పాలస్తీనాలో రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అంతర్జాతీయ కూటమి తన మొదటి సమావేశాలను సౌదీ రాజధాని రియాద్లో వచ్చే వారం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడం, బందీలను విడిపించేందుకు కృషి చేయడం, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అన్ని దేశాలు పాల్గొనేందుకు ప్రపంచ కూటమిని ప్రారంభించామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్సిలోనాలో జరిగిన 9వ ప్రాంతీయ ఫోరమ్లో ఈ మేరకు ఆయన తెలియజేశారు. రియాద్ సమావేశం తర్వాత, సంకీర్ణ కమిటీలు బ్రస్సెల్స్, కైరో, అమ్మాన్, ఇస్తాంబుల్, నార్వే రాజధాని ఓస్లోలో సమావేశం అవుతాయని తెలిపారు. గాజాలో పరిస్థితిని చర్చించడానికి రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని బోరెల్ సూచించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









