పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి.. రియాద్ లో గ్లోబల్ కూటమి సమావేశం..!!
- October 30, 2024
రియాద్: పాలస్తీనాలో రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అంతర్జాతీయ కూటమి తన మొదటి సమావేశాలను సౌదీ రాజధాని రియాద్లో వచ్చే వారం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడం, బందీలను విడిపించేందుకు కృషి చేయడం, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అన్ని దేశాలు పాల్గొనేందుకు ప్రపంచ కూటమిని ప్రారంభించామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్సిలోనాలో జరిగిన 9వ ప్రాంతీయ ఫోరమ్లో ఈ మేరకు ఆయన తెలియజేశారు. రియాద్ సమావేశం తర్వాత, సంకీర్ణ కమిటీలు బ్రస్సెల్స్, కైరో, అమ్మాన్, ఇస్తాంబుల్, నార్వే రాజధాని ఓస్లోలో సమావేశం అవుతాయని తెలిపారు. గాజాలో పరిస్థితిని చర్చించడానికి రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని బోరెల్ సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!







