ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియాడ్లో మెరిసిన భారతీయ అథ్లెట్లు..!!
- November 03, 2024
మనామా: మనామాలో అక్టోబర్ 23 నుండి 30 వరకు జరిగిన ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియేడ్లో పాల్గొన్న ఇండియాకు చెందిన 185 మంది యువ క్రీడాకారుల ప్రతినిధి బృందం రాణించింది. ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ISSO) ఇండియా నిర్వహించే ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను ఒక్కచోట చేర్చడం లక్ష్యం. అథ్లెట్లు ఆర్చరీ, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, ఫెన్సింగ్, జూడో, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్లతో సహా అనేక విభాగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. భారత జట్టు రెండు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసింది. అక్టోబర్ 29న భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి ‘విజిట్ ఎంబసీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయబారి వినోద్ కె. జాకబ్ యువ క్రీడాకారులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు రాయబార కార్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







