ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియాడ్లో మెరిసిన భారతీయ అథ్లెట్లు..!!
- November 03, 2024
మనామా: మనామాలో అక్టోబర్ 23 నుండి 30 వరకు జరిగిన ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియేడ్లో పాల్గొన్న ఇండియాకు చెందిన 185 మంది యువ క్రీడాకారుల ప్రతినిధి బృందం రాణించింది. ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ISSO) ఇండియా నిర్వహించే ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను ఒక్కచోట చేర్చడం లక్ష్యం. అథ్లెట్లు ఆర్చరీ, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, ఫెన్సింగ్, జూడో, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్లతో సహా అనేక విభాగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. భారత జట్టు రెండు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసింది. అక్టోబర్ 29న భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి ‘విజిట్ ఎంబసీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయబారి వినోద్ కె. జాకబ్ యువ క్రీడాకారులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు రాయబార కార్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







