రిటైర్ కు ముందట..Dh100,000 గెలుచుకున్న నిర్మాణ కార్మికుడు..!!
- November 23, 2024
యూఏఈ: ఆడవల్లి గంగనా ఆడవల్లి.. ఇటీవల రెండవ ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డును అందుకోవడం అతని జీవితంలో ఒక కీలక మలుపు. డార్విష్ ఇంజినీరింగ్ ఎమిరేట్స్లో 53 ఏళ్ల నిర్మాణ కార్మికుడుగా సేవలు అందిస్తున్నాడు. అతను గత 24 సంవత్సరాలుగా కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆడవల్లి మాట్లాడుతూ.. తాను 24 సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చి నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగం విభాగంలో తాను సాధించిన విజయం గురించి అడవల్లికి అతని మేనేజర్ నుండి కాల్ వచ్చినప్పుడు, అతను దానిని పెద్ద జోకుగా భావించాడు. ‘‘విజేతలు దేశాభివృద్ధికి చేసిన కృషికి Dh100,000 బహుకరిస్తారని నేను తెలుసుకున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను” అని ఆడవల్లి అన్నారు. మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఏటా నిర్వహించే ఈ అవార్డులు ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డు కూడా కార్మిక మార్కెట్ పోటీతత్వాన్ని పెంపొందించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. “నేను పదవీ విరమణ చేయబోతున్నందున, ఈ మొత్తం నా రిటైర్మెంట్ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నాకు చేతనైనంత కాలం పని చేస్తూనే ఉంటాను. చివరికి మా ఊరిలోనే స్థిరపడతాను.’’ అని ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆడవల్లి అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









