500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్..కంపెనీ నిర్వాహకులు అరెస్ట్..!!
- November 27, 2024
కువైట్: 500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్ చేస్తున్నకంపెనీ నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫోర్జరీ, అధికారిక పత్రాలను తారుమారు చేయడం, డబ్బుకు బదులుగా ప్రవాసులకు రెసిడెన్సీని కల్పించడం వంటి ఆరోపణలపై ఒక కువైట్ పౌరుడు, అతని బిజినెస్ పార్టనర్ సిరియన్ జాతీయుడితో సహా కంపెనీ నిర్వాహకుల ముఠాను అరెస్టు చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీలను చట్టవిరుద్ధంగా కంపెనీకి బదిలీ చేసారని, ఒక్కో కార్మికుడికి 500 దినార్ల చొప్పున కార్మికులకు హెవీ ఎక్విప్మెంట్ డ్రైవర్ రెసిడెన్సీని పొందేందుకు, కంపెనీ తన స్పాన్సర్షిప్ కింద రిఫర్ చేసిందని అధికారులు తెలిపారు దాదాపు 600 మంది కార్మికులు కంపెనీ కింద నమోదు చేసుకున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







