ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ లో గాయపడ్డ సైనికుడు.. 10 ఏళ్ల తర్వాత మృతి..!!
- November 28, 2024
యూఏఈ : 2015లో యెమెన్లో జరిగిన ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్లో పాల్గొని తీవ్ర గాయాలపాలైన యూఏఈ సైనికుడు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. మహ్మద్ అతిక్ సలేం బిన్ సలుమా అల్ ఖైలీ దాదాపు 10 సంవత్సరాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. సైనికుడి మరణాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించిన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 2015 సెప్టెంబరులో యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సమయంలో మొత్తం 52 మంది యూఏఈ సైనికులు మరణించారు. ఇదిలా ఉండగా, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన సైనికుడికి నివాళులర్పించారు. అల్ ఐన్లోని అబూ సమ్రా ప్రాంతంలో జరిగిన సంతాప మజ్లిస్కు షేక్ థెయాబ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







