ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ లో గాయపడ్డ సైనికుడు.. 10 ఏళ్ల తర్వాత మృతి..!!
- November 28, 2024
యూఏఈ : 2015లో యెమెన్లో జరిగిన ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్లో పాల్గొని తీవ్ర గాయాలపాలైన యూఏఈ సైనికుడు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. మహ్మద్ అతిక్ సలేం బిన్ సలుమా అల్ ఖైలీ దాదాపు 10 సంవత్సరాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. సైనికుడి మరణాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించిన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 2015 సెప్టెంబరులో యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సమయంలో మొత్తం 52 మంది యూఏఈ సైనికులు మరణించారు. ఇదిలా ఉండగా, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన సైనికుడికి నివాళులర్పించారు. అల్ ఐన్లోని అబూ సమ్రా ప్రాంతంలో జరిగిన సంతాప మజ్లిస్కు షేక్ థెయాబ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







