బహ్రెయిన్ లో ట్రావెల్ బ్యాన్.. బోర్డింగ్కు ముందే తెలుసుకోండిలా..!!
- November 28, 2024
మనామా: బహ్రెయిన్లోని ప్రయాణికులు ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ డెస్క్కి చేరుకోవడానికి ముందే ట్రావెల్ బ్యాన్ గుర్తించి తెలుసుకొని పరిష్కరించుకోవచ్చు. గతంలో ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్లను పొంది, ఇమ్మిగ్రేషన్కు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రయాణ నిషేధాలను తెలుసుకునేవారు. ఈ మేరకు విమానాశ్రయంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. కొత్త సిస్టమ్ ప్రకారం.. ఎయిర్లైన్ కౌంటర్లలో చెక్-ఇన్ సమయంలో పాస్పోర్ట్ వివరాలు నేరుగా ఇమ్మిగ్రేషన్ డేటాబేస్కి లింక్ చేయబడుతుంది. ఇది ఏవైనా ప్రయాణ నిషేధాలు లేదా ఇతర వివరాలను వెంటనే స్క్రీన్ పై చూపెడుతుంది.
చెల్లించని జరిమానాలు లేదా బిల్లులు వంటి చిన్న సమస్యలతో ఫ్లాగ్ చేయబడిన వారికి, సమీపంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో ప్రయాణికులు తమ బకాయిలను చెల్లించవచ్చు. అనంతరం రీ చెక్ ఇన్ చేసుకొని బయలుదేరవచ్చు. పౌరులు, నివాసితులు, ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి ప్రయాణ స్టేటస్ ను ఆన్లైన్లో చేస్ చేసుకోవాలని సూచించారు. పోర్టల్ (https://services.bahrain.bh/wps/portal/TravelBan_en) ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









