ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
- December 04, 2024
అమరావతి: దీంతో ఏసీ బస్సులపైన చలి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవో లకు అప్పగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గించారు. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10 శాతం తగ్గించారు. ఆదివారం నాడు హైదరాబాద్ కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూటులో చార్జీ తగ్గింపు లేదని తెలిపారు
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









