ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

- December 04, 2024 , by Maagulf
ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

అమరావతి: దీంతో ఏసీ బస్సులపైన చలి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవో లకు అప్పగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గించారు. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10 శాతం తగ్గించారు. ఆదివారం నాడు హైదరాబాద్ కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూటులో చార్జీ తగ్గింపు లేదని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com