షార్జాలో కత్తిపోట్లతో 27 ఏళ్ల యువకుడు మృతి..!!
- December 13, 2024
యూఏఈ: షార్జాలో అల్ సియూహ్లో 27 ఏళ్ల ఎమిరాటీ వ్యక్తి కత్తిపోట్ల కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఘటనకు సంబంధించి షార్జా పోలీస్ ఆపరేషన్స్ గదికి గురువారం అర్ధరాత్రి 12.40 గంటలకు కాల్ వచ్చింది. పోలీసు పెట్రోలింగ్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీమ్, నేషనల్ అంబులెన్స్ సేవలను వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు బాధితుడు డు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
12 గంటల్లో షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు సోదరులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి మధ్య వివాదం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవల కారణంగా పదునైన వస్తువుతో బాధితుడిని పొడిచినట్టు నిందితులువిచారణలో అంగీకరించారు. తదుపరి విచారణ కోసం కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, హింసకు పాల్పడకుండా ఉండాలని షార్జా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి