అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్..!
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు.
డిసెంబర్ 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి