జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడి నిందితుడు ప్రమాదకరం.. గతంలోనే హెచ్చరించిన సౌదీ..!
- December 24, 2024
రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఢీకొట్టి శుక్రవారం సాయంత్రం ఐదుగురు ప్రాణాలను బలిగొన్న ఘటనలో దాడి చేసిన తలేబ్ జవాద్ అల్-అబ్దుల్మోసెన్ను అప్పగించాలని సౌదీ అరేబియా గతంలో కోరింది. ఈ మేరకు గతంలోనే లెటర్ రాసినట్టు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అబ్దుల్మోహ్సేన్ "ప్రమాదకరం" అని సౌదీ అధికారులు జర్మనీని చాలాసార్లు హెచ్చరించారని, రియాద్ అప్పగింత అభ్యర్థనను చేసినట్టు అధికారులు తెలిపారు. అతను ఆన్లైన్లో వివాదాలకు కేరాఫ్ గా నిలిచాడు. పలువురిని బెదిరించిన కేసుల్లో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సౌదీ అధికారులు అబ్దుల్మోహ్సేన్పై పదేపదే ఆందోళనలు వ్యక్తం చేశారు. అబ్దుల్మోహ్సేన్ తనను తాను హింసకు గురైన వ్యక్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు.అతను గతంలోనే ఇస్లాంను విడిచిపెట్టాడు. అతను "జర్మనీ ఇస్లామీకరణ"ను బహిరంగంగా వ్యతిరేకిస్తు సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పడుతుంటాడని అధికారులు తెలిపారు. 2006లో జర్మనీకి వెళ్లిన అబ్దుల్మోసెన్కు దశాబ్దం తర్వాత శరణార్థి హోదా లభించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









