జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడి నిందితుడు ప్రమాదకరం.. గతంలోనే హెచ్చరించిన సౌదీ..!
- December 24, 2024
రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఢీకొట్టి శుక్రవారం సాయంత్రం ఐదుగురు ప్రాణాలను బలిగొన్న ఘటనలో దాడి చేసిన తలేబ్ జవాద్ అల్-అబ్దుల్మోసెన్ను అప్పగించాలని సౌదీ అరేబియా గతంలో కోరింది. ఈ మేరకు గతంలోనే లెటర్ రాసినట్టు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అబ్దుల్మోహ్సేన్ "ప్రమాదకరం" అని సౌదీ అధికారులు జర్మనీని చాలాసార్లు హెచ్చరించారని, రియాద్ అప్పగింత అభ్యర్థనను చేసినట్టు అధికారులు తెలిపారు. అతను ఆన్లైన్లో వివాదాలకు కేరాఫ్ గా నిలిచాడు. పలువురిని బెదిరించిన కేసుల్లో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సౌదీ అధికారులు అబ్దుల్మోహ్సేన్పై పదేపదే ఆందోళనలు వ్యక్తం చేశారు. అబ్దుల్మోహ్సేన్ తనను తాను హింసకు గురైన వ్యక్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు.అతను గతంలోనే ఇస్లాంను విడిచిపెట్టాడు. అతను "జర్మనీ ఇస్లామీకరణ"ను బహిరంగంగా వ్యతిరేకిస్తు సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పడుతుంటాడని అధికారులు తెలిపారు. 2006లో జర్మనీకి వెళ్లిన అబ్దుల్మోసెన్కు దశాబ్దం తర్వాత శరణార్థి హోదా లభించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







