మే 8 – 17: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- January 06, 2025
దోహా: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (DIBF) 34వ ఎడిషన్ దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో మే 8 నుండి 17 వరకు జరుగనుంది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వందలాది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. దీనికి గల్ఫ్, అరబ్ దేశాల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పుస్తక అభిమానులు హాజరవుతారు. బుక్ షో సందర్భంగా అనేక సాంస్కృతిక, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. DIBF మొదటి ఎడిషన్ ఖతారీ బుక్స్ హౌస్ పర్యవేక్షణలో 1972లో ప్రారంభించారు. 33వ ఎడిషన్ 29వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 42 దేశాల నుండి 515 మంది ప్రచురణకర్తలతో రికార్డును నెలకొల్పింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







