మే 8 – 17: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- January 06, 2025
దోహా: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (DIBF) 34వ ఎడిషన్ దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో మే 8 నుండి 17 వరకు జరుగనుంది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వందలాది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. దీనికి గల్ఫ్, అరబ్ దేశాల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పుస్తక అభిమానులు హాజరవుతారు. బుక్ షో సందర్భంగా అనేక సాంస్కృతిక, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. DIBF మొదటి ఎడిషన్ ఖతారీ బుక్స్ హౌస్ పర్యవేక్షణలో 1972లో ప్రారంభించారు. 33వ ఎడిషన్ 29వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 42 దేశాల నుండి 515 మంది ప్రచురణకర్తలతో రికార్డును నెలకొల్పింది.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







