దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- January 23, 2025
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించిన కొత్త బస్ పూలింగ్ సర్వీస్ నివాసితులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రారంభించిన మొదటి 10 రోజుల్లోనే 500 మందికి పైగా ఈ సేవను ఉపయోగించుకున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరామా నివాసి తారెక్ ప్రతిరోజూ బిజినెస్ బేలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ఈ సర్వీస్ ను ఉపయోగిస్తున్నారు. "ఇది ఇది RTA బస్సు కంటే ఉత్తమం. ఎందుకంటే మీరు బస్ స్టాప్కు సమయానికి చేరుకోకపోతే, మీరు తదుపరి బస్సు కోసం వేచి ఉండాలి. అలాగే మధ్యలో చాలా స్టాప్లు ఉన్నాయి. ఈ సర్వీస్ నన్ను నా ఇంటి నుండి కార్యాలయానికి 15 నుండి 20 నిమిషాల్లో చేరవేస్తుంది. ఇది చాలా పొదుపుగా కూడా ఉంది." అని వివరించాడు. డిసెంబర్ 2024లో ప్రారంభించబడిన బస్ పూలింగ్ సర్వీస్, స్మార్ట్ యాప్లలో బుకింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు మినీబస్ రైడ్లను ఎంచుకోవచ్చు. స్థానికంగా, అంతర్జాతీయంగా ప్రజా రవాణా వ్యవస్థలలో ప్రత్యేకత కలిగిన మూడు కంపెనీల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది. ఈ-హెయిల్ ట్యాక్సీ సేవల కంటే ఈ సర్వీస్ ధర దాదాపు 20 నుంచి 30 శాతం చౌకగా ఉంటుందని ఆర్టీఏ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







