దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- January 23, 2025
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించిన కొత్త బస్ పూలింగ్ సర్వీస్ నివాసితులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రారంభించిన మొదటి 10 రోజుల్లోనే 500 మందికి పైగా ఈ సేవను ఉపయోగించుకున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరామా నివాసి తారెక్ ప్రతిరోజూ బిజినెస్ బేలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ఈ సర్వీస్ ను ఉపయోగిస్తున్నారు. "ఇది ఇది RTA బస్సు కంటే ఉత్తమం. ఎందుకంటే మీరు బస్ స్టాప్కు సమయానికి చేరుకోకపోతే, మీరు తదుపరి బస్సు కోసం వేచి ఉండాలి. అలాగే మధ్యలో చాలా స్టాప్లు ఉన్నాయి. ఈ సర్వీస్ నన్ను నా ఇంటి నుండి కార్యాలయానికి 15 నుండి 20 నిమిషాల్లో చేరవేస్తుంది. ఇది చాలా పొదుపుగా కూడా ఉంది." అని వివరించాడు. డిసెంబర్ 2024లో ప్రారంభించబడిన బస్ పూలింగ్ సర్వీస్, స్మార్ట్ యాప్లలో బుకింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు మినీబస్ రైడ్లను ఎంచుకోవచ్చు. స్థానికంగా, అంతర్జాతీయంగా ప్రజా రవాణా వ్యవస్థలలో ప్రత్యేకత కలిగిన మూడు కంపెనీల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది. ఈ-హెయిల్ ట్యాక్సీ సేవల కంటే ఈ సర్వీస్ ధర దాదాపు 20 నుంచి 30 శాతం చౌకగా ఉంటుందని ఆర్టీఏ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







