కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!
- January 26, 2025
కువైట్: కువైట్ కు చెందిన యోగా ప్రాక్టిషనర్ షైఖా AJ అల్ సబాహ్ కు ఇండియా మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రకటించారు. పద్మ అవార్డులు అందుకోనున్న మొత్తం 30 మందిలో ఆమె ఒకరు. కువైట్లో మొదటి లైసెన్స్ పొందిన యోగా స్టూడియో అయిన దరత్మాను స్థాపించిన 48 ఏళ్ల యోగా అభ్యాసకురాలు షైఖాకు యోగా పట్ల ఆమె చేసిన కృషికి భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె ప్రత్యేకమైన సాంప్రదాయ పద్ధతులతో గల్ఫ్ ప్రాంతంలో యోగాభ్యాసాన్ని ప్రోత్సహించింది. ఆమె 2021లో యోమ్నాక్ లిల్ యమన్కు నాయకత్వం వహించింది. యెమెన్ శరణార్థులు, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో నిరాశ్రయులైన ప్రజల కోసం నిధుల సేకరణలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. డిసెంబరులో కువైట్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం షైఖాకు దక్కింది.
ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సోషల్ వర్క్, మెడిసిన్, లిటరేచర్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ మొదలైన వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









