కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!
- January 26, 2025
కువైట్: కువైట్ కు చెందిన యోగా ప్రాక్టిషనర్ షైఖా AJ అల్ సబాహ్ కు ఇండియా మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రకటించారు. పద్మ అవార్డులు అందుకోనున్న మొత్తం 30 మందిలో ఆమె ఒకరు. కువైట్లో మొదటి లైసెన్స్ పొందిన యోగా స్టూడియో అయిన దరత్మాను స్థాపించిన 48 ఏళ్ల యోగా అభ్యాసకురాలు షైఖాకు యోగా పట్ల ఆమె చేసిన కృషికి భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె ప్రత్యేకమైన సాంప్రదాయ పద్ధతులతో గల్ఫ్ ప్రాంతంలో యోగాభ్యాసాన్ని ప్రోత్సహించింది. ఆమె 2021లో యోమ్నాక్ లిల్ యమన్కు నాయకత్వం వహించింది. యెమెన్ శరణార్థులు, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో నిరాశ్రయులైన ప్రజల కోసం నిధుల సేకరణలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. డిసెంబరులో కువైట్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం షైఖాకు దక్కింది.
ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సోషల్ వర్క్, మెడిసిన్, లిటరేచర్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ మొదలైన వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







