కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!
- January 26, 2025
కువైట్: కువైట్ కు చెందిన యోగా ప్రాక్టిషనర్ షైఖా AJ అల్ సబాహ్ కు ఇండియా మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రకటించారు. పద్మ అవార్డులు అందుకోనున్న మొత్తం 30 మందిలో ఆమె ఒకరు. కువైట్లో మొదటి లైసెన్స్ పొందిన యోగా స్టూడియో అయిన దరత్మాను స్థాపించిన 48 ఏళ్ల యోగా అభ్యాసకురాలు షైఖాకు యోగా పట్ల ఆమె చేసిన కృషికి భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె ప్రత్యేకమైన సాంప్రదాయ పద్ధతులతో గల్ఫ్ ప్రాంతంలో యోగాభ్యాసాన్ని ప్రోత్సహించింది. ఆమె 2021లో యోమ్నాక్ లిల్ యమన్కు నాయకత్వం వహించింది. యెమెన్ శరణార్థులు, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో నిరాశ్రయులైన ప్రజల కోసం నిధుల సేకరణలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. డిసెంబరులో కువైట్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం షైఖాకు దక్కింది.
ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సోషల్ వర్క్, మెడిసిన్, లిటరేచర్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ మొదలైన వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







