యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- February 12, 2025
యూఏఈ: వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2025లో యూఏఈ బ్లూ వీసా మొదటి దశను ప్రారంభించింది. 10 సంవత్సరాల రెసిడెన్సీ పర్మిట్ వివరాలను ఈ సందర్భంగా ప్రకటించారు. వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకారం.. ఇరవై మంది పర్యావరణవేత్తలకు మొదటి దశలో బ్లూ వీసాను ప్రదానం చేయనున్నారు.
బ్లూ వీసా అనేది యూఏఈ లోపల, వెలుపల పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత కోసం అసాధారణమైన సహకారం అందించిన వ్యక్తుల కోసం 10 సంవత్సరాల నివాస వీసాను అందజేయనున్నారు. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, అసోసియేషన్లు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులు, గ్లోబల్ అవార్డు విజేతలు, పర్యావరణ పనిలో విశిష్ట కార్యకర్తలు, పరిశోధకులతో సహా పర్యావరణ చర్యల మద్దతుదారులకు ఈ వీసా ఇస్తున్నారు. బ్లూ వీసా అనేది గతంలో ప్రారంభించబడిన గోల్డెన్, గ్రీన్ రెసిడెన్సీకు పొడిగింపుగా తీసుకొచ్చారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఎలక్ట్రానిక్ సిస్టమ్ మొదటి దశ ICP వెబ్సైట్లో ఆమోదించబడిన విధానాలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలు సమర్పించిన దరఖాస్తుల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రక్రియలో ఆమోదిస్తారు. యూఏఈ బ్లూ వీసాను పొందేందుకు ఆసక్తి ఉన్న సస్టైనబిలిటీ అడ్వకేట్లు, నిపుణులు నేరుగా ICPకి లేదా యూఏఈలోని సమర్థ అధికారులచే నామినేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ICP ఆమోదించబడిన నిబంధనలు, షరతులకు లోబడి దాని వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా అర్హత కలిగిన వ్యక్తుల కోసం బ్లూ వీసా సేవకు 24/7 యాక్సెస్ను అందిస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







