ఈ-స్కూటర్ ప్రమాదంలో 15 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి..!!
- February 28, 2025
దుబాయ్: రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల భారతీయ విద్యార్థి, బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్యాడ్మింటన్ మృతి చెందారు. ఫిబ్రవరి 25 సాయంత్రం జులేఖా హాస్పిటల్కు సమీపంలోని అల్ నహ్దా సమీపంలో ఇ-స్కూటర్ ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 27న అసర్ ప్రార్థనల అనంతరం దుబాయ్లోని ఖుసైస్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దుబాయ్లోని బ్యాడ్మింటన్ సంఘం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెకు తోటి క్రీడాకారులు, కోచ్ల నుండి నివాళులర్పించారు.
గత సంవత్సరం దుబాయ్ సైకిళ్లు, ఇ-స్కూటర్లకు సంబంధించి 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. అవసరమైన పరికరాలు లేని లేదా హెల్మెట్ మరియు వెస్ట్ నిబంధనలను పాటించని సైకిళ్లు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రయాణీకులను తీసుకెళ్లకుండా అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే 200 దిర్హామ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణీకులను తీసుకెళ్తే 300 దిర్హామ్లు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!