జైలు సందర్శన సమయాల ప్రకటన
- July 03, 2016
పోలీస్ శాఖకు చెందిన ప్యునిటివ్ మరియు కరెక్షనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిపార్ట్మెంట్, జైల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు ఖైదీల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక 'టైమింగ్స్'ని ప్రకటించింది. అన్ని దేశాలకు చెందిన పురుష ఖైదీలను పరామర్శించేందుకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తారు, అదే మహిళా ఖైదీలకు అయితే ఈ సమయం మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఒకటో నంబర్ బిల్డింగ్లో ఈ అవకాశం కల్పిస్తారు. తొలి రోజు టైమింగ్స్ ఇలా ఉంటే, రెండో రోజు రెండో నెంబర్ భవనంలో అవకాశం కల్పిస్తారు. సమయం తొలి రోజు టైమింగ్స్లానే ఉంటాయి. మిస్డెమీనస్ మరియు వయొలేషన్స్ ప్రిజన్, విమెన్స్ ప్రిజన్, జువైనల్ సెక్షన్, అరబ్ మరియు ఎమిరేటీ మేల్ విజిటర్స్ 8 నుంచి 11 గంటల వరకు (ఉదయం) తొలి రోజు, అరబ్ మరియు ఎమిరేటీ ఫిమేల్ విజిటర్స్ 2.30 నుంచి 5 గంటలు (మధ్యాహ్నం) వరకు ఈద్ మొదటి రోజు సందర్శించవచ్చు. రెండో రోజు కూడా ఇవే సమయాలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









