దొంగతనం కేసులో ఐదుగురికి జైలు
- July 03, 2016
ఓ విల్లాలోకి అక్రమంగా ప్రవేశించి 945,000 దిర్హామ్ల నగదు, విలువైన వస్తువుల్ని దొంగతనం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష పడింది. చైనా నుంచి వచ్చిన ఈ పర్యాటకుల వయసు 24 నుంచి 37 ఏళ్ళు. ఉమ్ సకెమ్లో అర్థరాత్రి దొంగతనం చేశారు. జులై 2015లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన సమయంలో తాము యూఏఈలో లేమని నిందితులు పేర్కొన్నారు. విల్లా ఓనర్ మాట్లాడుతూ, ఇంట్లోకి వెళ్ళే సరికి అంతా చిందరవందరగా కనిపించిందనీ, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని, నగదు సహా విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు, దొంగతనానికి గురైన వస్తువుల్ని గుర్తించాలని కోరారని, తాను వెళ్ళి తన వస్తువుల్ని గుర్తించానని ఆయన అన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై నిందితులు 10 రోజుల్లోగా అపీల్ చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









