అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి!

- March 09, 2025 , by Maagulf
అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి!

అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి!

న్యూ ఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 73 ఏళ్ల ధంఖర్‌ను ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ధంఖర్‌ను ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com