మరోసారి బాంబులతో మారుమోగిన సౌదీ
- July 04, 2016
సౌదీ అరేబియాలో మరోసారి ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఖతీఫ్ లోని ఓ ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మదీనాలోని సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం జెడ్డాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అతడిని నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తునాతునకలయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న మసీదు వైపుగా వెళుతూ అతడు ఈ ఘాతుకానికి దిగాడు.


తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









