హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ: సీఎం చంద్రబాబు
- March 17, 2025
అమరావతి: హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఉద్యమంలో జరుగుతోంది.ఏకంగా అక్కడ రూపాయి సింబల్ హిందీలో ఉందని మార్చేసి రూ అని తమిళంలో పెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.పీ4 పేరుతో జరిగిన చర్చలో చంద్రబాబు భాషపై జరుగుతున్న వివాదంపై స్పందించారు.
మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని అదే టైంలో కమ్యూనికేషన్కు జీవనోపాధికి అవసరమయ్యే ఏ భాష అయినా నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్ని భాషలైనా నేర్చుకుంటామని కానీ మాతృభాషను మాత్రం మర్చిపోమని అభిప్రాయపడ్డారు. మన దేశంలోని భాషలే కాకుండా విదేశ భాషలు కూడా నేర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని వివరించారు.
"కొంతమంది ఇంగ్లీష్ జ్ఞానంతో సమానమని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. భాష కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అది జ్ఞానాన్ని తీసుకురాదు. మాతృభాషలో చదివినప్పుడు మంచి జ్ఞానం సంపాధిస్తారు. మాతృభాష నేర్చుకోవడం సులభం. అదే అనుభవంతో ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు" అని ఆయన అన్నారు.
హిందీ నేర్చుకుంటే ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ సులభమవుతుందని అన్నారు. దీన్ని ఓ రాజకీయ అంశంగా చేసి వివాదాలు సృష్టించకుండా ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవలాని అసెంబ్లీ అభిప్రాయపడ్డారు. "జీవనోపాధి కోసం మనం ఎన్ని భాషలనైనా నేర్చుకుంటాం. మనం మాతృభాషను మర్చిపోం. భాష కమ్యూనికేషన్ కోసం మాత్రమే.ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఉత్తమం," అని చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్