అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నుండి పవర్ ఫుల్ టీజర్
- March 17, 2025
విజయశాంతి కొన్నాళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మళ్ళీ రానుంది. అప్పట్లో విజయశాంతి అంటే కమర్షియల్ సినిమాలతో పాటు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కూడా మళ్ళీ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది.
తాజాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్లో విజయశాంతి పోలీస్ పాత్రలో అదరగొట్టారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించగా కళ్యాణ్ రామ్ రామ్, విజయశాంతితో పాటు మూవీ యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయం తెలిపారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయ్యాక చేపల పులుసు చేసి ఇస్తాను అని చెప్పాను. ఈ సినిమా మొదలయినప్పుడు అమ్మ(విజయశాంతి) ఒక మొక్కు మొక్కుకుంది. రిలీజయ్యాక తిరుమల వెళ్లి కాలినడకన వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటాము. అప్పటి వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారు. అది అయ్యాక అమ్మకి నేనే చేపల పులుసు చేసి పెడతాను అని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్