నిషేధిత కంటెంట్ను షేర్ చేస్తే Dh1 మిలియన్ జరిమానా, జైలుశిక్ష..!!
- March 18, 2025
యూఏఈ: సోషల్ మీడియాలో సామాజిక వ్యతిరేక, నైతికంగా అనైతిక కంటెంట్ను పోస్ట్ చేసి షేర్ చేసే 1 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా, జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు పలువురు న్యాయవాదులు వెల్లడించారు. యూఏఈ చట్టం ప్రకారం, నిషేధించబడిన కంటెంట్ను షేర్ చేసే, తిరిగి పోస్ట్ చేసే లేదా పంపిణీ చేసే వ్యక్తి అసలు పోస్ట్ చేసిన వారితో సమానంగా బాధ్యత వహిస్తారు. యూఏఈ లోని సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవన సూత్రాలకు అనుగుణంగా వ్యవహారించాలని యూఏఈ జాతీయ మీడియా కార్యాలయం (NMO) పేర్కొంది. జాతీయ చిహ్నాలు, ప్రజా వ్యక్తులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా తాజాగా హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి Dh1,000 నుండి Dh1 మిలియన్ వరకు జరిమానాలు విధించవచ్చని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా Dh2 మిలియన్లకు పెరుగుతుందన్నారు. అదే సమయంలో ఉల్లంఘించే మీడియా సంస్థలను 6 నెలల వరకు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని అల్ తమీమి & కంపెనీలో డిజిటల్, డేటా అసోసియేట్ ఫాత్మా అల్ జడ్జాలి ఖలీజ్ టైమ్స్తో అన్నారు.
సోషల్ మీడియా వాడకం అనేది యూఏఈలో ప్రవాసులు, జాతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. సగటున, ప్రతి నివాసి Instagram, Facebook, X, TikTok ఇతర ప్రముఖ ప్లాట్ఫామ్లలో ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సాధారణ మీడియా చట్ట ఉల్లంఘనలతో పాటు, సోషల్ మీడియాలో చేసిన నిర్దిష్ట చర్యలు కూడా తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్