ముస్లిం లకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ….

- March 31, 2025 , by Maagulf
ముస్లిం లకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ….

న్యూ ఢిల్లీ: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలగాలని ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు.దీంతో సోమవారం ఈద్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com