బోలోగ్నా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2025..సౌదీ అరేబియా పెవిలియన్..!!
- April 01, 2025
బోలోగ్నా: ఇటలీలోని బోలోగ్నా ఫియర్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బోలోగ్నా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2025లో సౌదీ అరేబియా తన జాతీయ పెవిలియన్ను ప్రారంభించింది. సాహిత్యం, ప్రచురణ, ట్రాన్స్ లేషన్ కమిషన్ ఈ పెవిలియన్ను నిర్వహిస్తుంది.
సాహిత్య అథారిటీ సీఈఓ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-వాసిల్ మాట్లాడుతూ.. సౌదీ భాగస్వామ్యం ప్రచురణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సాంస్కృతిక ఎంగేజ్ మెంట్ పెంచడానికి రూపొందించిన అనేక కార్యక్రమాలను ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రదర్శన సందర్భంగా దేశం గొప్ప మేధో వారసత్వం, సాంస్కృతిక గుర్తింపును హైలైట్ చేస్తాయని తెలిపారు.
"ఈ ప్రదర్శన సౌదీ ప్రచురణకర్తలు తమ ప్రపంచ ప్రత్యర్ధులతో కనెక్ట్ అవ్వడానికి, ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది" అని డాక్టర్ అల్-వాసిల్ పేర్కొన్నారు.
సౌదీ పెవిలియన్ కింగ్ సల్మాన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ ది అరబిక్ లాంగ్వేజ్, కింగ్ అబ్దులాజీజ్ పబ్లిక్ లైబ్రరీ, కింగ్ ఫహద్ నేషనల్ లైబ్రరీ, సౌదీ పబ్లిషింగ్ అసోసియేషన్ వంటి అనేక సాంస్కృతిక సంస్థలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







